ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు ఆయన పర్యటనకు షెడ్యూల్ ఖరారు అయింది.

పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ కు రానున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ క్రమంలో రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రింగ్ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.

అయితే పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముగ్గురు అగ్రనేతలు పర్యటించాలని గతంలోనే బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నాగర్ కర్నూల్ జిల్లాలో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖమ్మం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.

అయితే పర్యటనలో అధికారిక కార్యక్రమాలు ఉండనున్నాయా? లేక కేవలం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే ఉంటాయా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

షాంపూలో ఇవి కలిపి హెయిర్ వాష్ చేసుకుంటే ఆరోగ్యమైన మెరిసేటి కురులు మీ సొంతం!