విలక్షణ నటుడు అంటూ చిరంజీవిపై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..!!

ఇటీవల కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారం ప్రకటించడం తెలిసిందే.

ఇదే విషయాన్ని కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియా ద్వారా కూడా వెల్లడించడం జరిగింది.

గోవా వేదికగా నవంబర్ 20 నుండి 28 వరకు ఈ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం సందర్భంగా.

చిరంజీవికి ప్రకటించిన పురస్కారంపై ప్రధాని మోడీ ట్విట్టర్ లో స్పందించారు."చిరంజీవి గారు విలక్షణమైన నటుడు.

అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు".

అని సంచలన పోస్ట్ పెట్టారు.దీంతో ప్రధాని మోడీ అభినందనలు పట్ల చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేశారు.

మీ అభినందనలు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు.మీ మాటలు సంతోషం కలిగించినట్లు బదులిచ్చారు.

ఇక చిరంజీవికి ఈ పురస్కారం రావడం పట్ల జనసేన అధినేత పవన్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.

పవన్ తో పాటు మెగా హీరోలు కూడా స్పందించడం జరిగింది.గోవాలో జరగనున్న ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దాదాపు 280 సినిమాలు ప్రదర్శించనున్నారు.

ఈ క్రమంలో సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వారికీ పురస్కారాలు అందిస్తున్నారు.

వీడియో: రీల్స్ కోసం ఆటో వెనుక వేలాడుతూ స్టంట్స్‌ చేసిన యువకులు.. చివరికి..?