సీనియర్ ఎన్టీఆర్ పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అందరికి సుపరిచితుడే.ప్రపంచంలోనే తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన సీనియర్ ఎన్టీఆర్.

సినిమా రంగంలో అదేవిధంగా రాజకీయ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు.ప్రపంచంలో ఇప్పటికీ కూడా తెలుగువారు అంటే ముందుగా ఎన్టీఆర్ పేరు ప్రస్తావన రావాల్సిందే.

అటువంటి సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళ్తే ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ సీనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు తీసుకువచ్చారు.

ఎన్టీఆర్ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి.కింది స్థాయిలో పోరాటం చేసి అధికారంలోకి వచ్చారని గొప్పగా చెప్పారు.

రాజకీయ పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి ఆయన రావటం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని స్పష్టం చేశారు.

అదే రీతిలో బండి సంజయ్ కూడా పోరాడుతున్నారని ప్రధాని మోడీ ప్రశంసించారు. """/"/ బండి సంజయ్ పోరాట తీరు అభినందనీయమని కొనియాడారు.

ఎన్నడూ లేని రీతిలో సీనియర్ ఎన్టీఆర్ పై ప్రధాని మోడీ తెలంగాణ రాజకీయాలు ప్రస్తావించి పొగడటం సంచలనం రేపింది.

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ.టీడీపీ పొత్తు కుదిరే అవకాశం ఉందని ఏపీ రాజకీయాలు కూడా మారే అవకాశం ఉందని మోడీ తాజా వ్యాఖ్యలపై కామెంట్లు వస్తున్నాయి.

వైకల్యం ఉన్నా అందాల పోటీలో విజేతగా నిలిచిన మహిళ.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!