గుడిలో నిత్యం పూజలు చేసే ఓ పూజారి బుద్ధి వక్రించడంతో పవిత్ర దేవాలయంలో పాడుపని చేయబోయాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా అమరాతి మండలం వైకుంఠపురం గ్రామంలోని ఓ ఆలయంలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.విజయవాడకు చెందిన దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠపురంలోని ఆలయానికి విచ్చేసి సంతానం కోసం పూజలు నిర్వహించారు.
ఈ క్రమంలో పూజారి ఆ మహిళతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి ఆమెను ఏకాంతంగా కలిశాడు.
ఈ క్రమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు ఆ పూజారి.దీంతో ఆ మహిళ అతడిని ఎదురించి, గట్టిగా కేకలు వేసింది.
అంతే ఆ పూజారి అక్కడి నుండి దెబ్బకు పారిపోయాడు.ఈ ఘటనను ఆ దంపతులు గ్రామంలో చెప్పి వెళ్లిపోయారు.
కాగా గ్రామస్తులు ఆ పూజారిపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఓ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించి పరారీలో ఉన్న ఆ పూజారిపై దేవాదాయ అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ ఘటనపై వారు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.
భారతదేశంలో కూడా భూకంపం రాబోతోందా? అసలేం జరుగుతోంది?