అమెరికా విదేశాంగ శాఖలో భారతీయుడికి అత్యున్నత పదవి.. బైడెన్ ఆదేశాలు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు కట్టబెడుతూ వస్తున్నారు జో బైడెన్.

అలా ఇప్పటి వరకు 130 మందికి పైగా ఇండో అమెరికన్లు కీలక స్థానాల్లో నియమించబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

యునైటెడ్ స్టేట్స్‌ జనాభాలో ఒక శాతంగా వున్న భారతీయులకు దేశ పాలనలో ఈ స్థాయిలో అవకాశాలు దక్కడం నిజంగా మనం గర్వించాల్సిన విషయమే.

తాజాగా భారత సంతతికి చెందిన రిచర్డ్ వర్మకు బైడెన్ కీలక బాధ్యతలు కట్టబెట్టారు.

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్‌కు డిప్యూటీ సెక్రటరీగా రిచర్డ్ వర్మను నామినేట్ చేశారు.

ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.52 ఏళ్ల వర్మ ప్రస్తుతం మాస్టర్ కార్డ్ గ్లోబల్ పబ్లిక్ పాలసీకి జనరల్ కౌన్సెల్, హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ హోదాలో ఆయన అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వున్న కంపెనీ చట్టం, విధాన పరమైన విధులను పర్యవేక్షిస్తారు.

డెమొక్రాటిక్ పార్టీకి చెందిన రిచర్డ్ వర్మ 2014 నుంచి 2016 వరకు భారత్‌లో అమెరికా రాయబారిగా వ్యవహరించారు.

ఈ ఏడాది ప్రారంభంలోనూ బైడెన్ తన ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగానూ రిచర్డ్ వర్మను నియమించిన సంగతి తెలిసిందే.

ప్రెసిడెంట్స్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డ్ (పీఐఏబీ) అనేది అధ్యక్షుని కార్యనిర్వాహక కార్యాలయంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక ఏజెన్సీ.

"""/"/ ఇకపోతే.రిచర్డ్ వర్మ తల్లిదండ్రులు భారత్ నుంచి 1960వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు.

ఆయన తండ్రి దాదాపు నలభై ఏళ్ల పాటు యూనివర్సిటీ ఆఫ్ పీట్స్‌బర్గ్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

వర్మ తల్లి కూడా ఉపాధ్యాయురాలు కావడం విశేషం.జాన్స్‌టౌన్, పెన్సిల్వేనియాలలో రిచర్డ్ వర్మ పెరిగారు.

వెస్ట్‌మాంట్ హిల్‌టాప్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు.జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ లా సెంటర్‌లో ఎల్ఎల్ఎం, వాషింగ్టన్ కాలేజ్ ఆఫ్ లాలో జేడీ, లెహి వర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో బీఎస్ చేశారు.

 .

‘భరత్ టెన్ ప్రామిసెస్ ‘ సొంత మ్యానిఫెస్టో ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి