ఆ హీరోయిన్ కి ఏమైంది... ఈ మధ్య అస్సలు కనిపించడం లేదుగా...

టాలీవుడ్ లో జయం, అవునన్నా కాదన్నా, దొంగ దొంగది, ఇంకా పలు టాలీవుడ్ యంగ్ హీరోల చిత్రాల్లో మెరిసినటువంటి హీరోయిన్ సదా ఇప్పటికీ బాగానే ప్రేక్షకులకి గుర్తుంటుంది.

అయితే వచ్చిన అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులకి మంచి ఎమోషనల్ పాత్రలు చేస్తూ బాగానే కనెక్ట్ అయింది.

అయితే పాత్రల ఎంపిక విషయంలో కొంతమేర తప్పటడుగులు వేయడంతో ఈ భామ టాలీవుడ్ సినీ పరిశ్రమలో తళుక్కున మెరిసి తెరమరుగైపోయింది.

ఈ మధ్యకాలంలో హీరోయిన్ సదా "శ్రీమతి 21ఎఫ్" అనే చిత్రంలో నటించింది.అయితే ఈ చిత్రం తమిళంలో మంచి హిట్ అయినప్పటికీ తెలుగులో మాత్రం అసలు విడుదలైనట్లు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియలేదు.

 ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ సదా వేశ్య పాత్రలో నటించింది.ఈ చిత్రంలో సదా తన నటన పరంగా 100% శాతం న్యాయం చేసినప్పటికీ అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోయింది.

దీంతో ప్రస్తుతం సదా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నట్లు సమాచారం. """/"/ అయితే గతంలో వేశ్య పాత్రలు చేసినటువంటి అనుష్క శెట్టి, విద్యాబాలన్, తదితర హీరోయిన్లు సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు.

అంతేకాక మంచి సినిమాల ఆఫర్లు కూడా దక్కించుకున్నారు.అయితే ఈ విషయం సదాకి వర్కౌట్ కాలేదు.

దీంతో ఈ అమ్మడు అవకాశాలు లేక ప్రస్తుతం ఇబ్బంది పడుతోంది. .

భారతీయులు లేకుండా యూఎస్ టెక్ ఇండస్ట్రీ కష్టమే : సిలికాన్ వ్యాలీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈవో