హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కల్తీ అల్లం తయారీ.. !

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో కల్తీ అల్లం తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది.

ఉప్పర్ పల్లి ప్రాంతంలో ఉన్న గోదాంలలో నకిలీ అల్లం పేస్టును తయారు చేస్తున్నట్లు సమాచారం.

అదేవిధంగా అల్లం పేస్ట్ తయారీలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు తెలుస్తోంది.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి కల్తీ ముఠాను పట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం 3.

5 టన్నుల కల్తీ అల్లం పేస్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈశ్వరన్ కేసులో కీలక పరిణామం .. సింగపూర్ వ్యాపారవేత్తపై అభియోగాలు