కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టు సభ్యులపై సెటైర్ వేసిన సొట్ట బుగ్గల సుందరీ…!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే బౌండరీలు వికెట్లు మాత్రమే కాదు.గ్రౌండ్ స్టాండ్స్ లో ఇచ్చే అభిమానుల కోలాహలంతో రెట్టింపు మజా అందిస్తుంది.

వీరితో పాటు మ్యాచ్ లను చూడడానికి వచ్చే అనేకమంది హై ప్రొఫైల్ వ్యక్తులు రావడంతో మరింతగా దీనికి కలర్ చేకూరుతుంది.

ఇక అసలు విషయంలోకి వెళితే.తన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును ప్రోత్సహిస్తూ ప్రీతిజింతా ఐపీఎల్ మైదానంలో ప్రతిసారి తెగ సందడి చేస్తూ కనిపిస్తుంది.

ప్రీతిజింతా గ్రౌండ్ కు వచ్చిందంటే చాలు.ఆమె వైపు కెమెరా కళ్లు ఎన్నోసార్లు తిరుగుతుంటాయో చెప్పాల్సిన అవసరం లేదు.

ఈవిడ గ్రౌండ్ వచ్చిందంటే గ్రౌండ్ లో ఉండే క్రికెటర్ల కంటే ఆమె వైపు ఎక్కువగా ఆసక్తి చూపించాలా తెగ హడావిడి చేస్తూ ఉంటుంది.

ఇకపోతే ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ యూఏఈ దేశంలో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఆ అమ్మడు ఎలాంటి సందడీ చేస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కు సంబంధించి ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో పై జట్టు యజమానురాలు ప్రీతిజింతా కాస్త వ్యంగంగా కామెంట్ చేశారు.

ఇకపోతే ఈ వీడియోను కింగ్స్ పంజాబ్ ఎలెవన్ జట్టు ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసింది.

ఈ వీడియోలో హర్ ప్రీత్ సింగ్ బ్యాటింగ్ చేస్తుండగా, హర్ష దీప్ సింగ్ బౌలింగ్ ఫోజులతో స్లో మోషన్ లో డాన్స్ చేస్తున్నట్లు గా కనబడుతుంది.

ఇక ఈ వీడియో కి " ఆట పాట ఆల్ ఇన్ వన్ " అనే క్యాప్షన్ ను జత చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీం.

ఇకపోతే ఈ వీడియోకు ప్రీతిజింతా కాస్త వ్యంగంగా మన ఆటగాళ్లు బాగా కష్టపడుతున్నారుగా అంటూ వ్యంగంగా కామెంట్ చేసింది.

ఇకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో అభిమానులను మ్యాచ్ చూసేందుకు అనుమతించడం లేదు.

దీంతో ఈ సారి జరిగే ఐపీఎల్ కాస్త సందడి లేకుండా సాగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

షర్మిల ఓడిపోతుందని బాధపడుతున్న జగన్