కరోనా నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
TeluguStop.com
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2 కోట్ల 28 లక్షలమందికిపైగా వ్యాపించింది.
అందులో కోటి 50 లక్షలమంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా 8 లక్షల మంది మృతి చెందారు.
అయితే కరోనా వైరస్ భారత్ లోకి అడుగుపెట్టిన సమయంలో బయపడినట్టు ఇప్పుడు బయపడ్డాం లేదు.
ఆస్పత్రులకు పరిగెత్తడం లేదు.ఇంట్లోనే ఉండి మంచి ఆహారం తీసుకొని కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నారు.
కోలుకునే వరకు అంత బాగుంది.మరి కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోండి.
ఆహారాన్ని హడావుడిగా తీసుకోకూడదని అంటున్నారు వైద్యులు.అంతేకాదు ఏది పడితే అది తినడం మంచిదికాదని, ఆహారం తీసుకునే విషయంలో కచ్చితంగా ఆహార వేళలు పాటించాలని చెప్తున్నారు.
అంతేకాదు ఎక్కువ మాంసాలతో కూడిన ఆహారాన్ని తినకూడదట.డిశ్చార్జి సమయంలో వైద్యులు రాసిచ్చిన మందులను పూర్తిగా వాడాలని చెప్తున్నారు.
రోగ నిరోధక శక్తినిచ్చే పండ్లు, ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
అంతేకాదు వీలైనంత వరకు వేడి నీరు తీసుకోవాలని కుదిరితే ప్రతి రోజూ స్టీమ్ థెరపీ చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని వైద్యులు సూచిస్తున్నారు.
ఇడ్లీ, దోసె బదులు బ్రేక్ ఫాస్ట్ లో ఇది తినండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి!