ఏపీలో 'లైగర్' భారీ బిజినెస్.. అన్ని కోట్లు రాబడుతుందా?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా 'లైగర్'.

ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరీ ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత వీరి ఎదురు చూపులు పీక్స్ కు చేరుకున్నాయి.

హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

లైగర్ టీమ్ అంతా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.ముఖ్యంగా బాలీవుడ్ లో వరుస ప్రొమోషన్స్ చేస్తూ దూసుకు పోతున్నారు.

రోజురోజుకూ అంచనాలు పెరగడంతో ఈ సినిమా బిజినెస్ అంతటా అంచనాలను మించి జరుగుతుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలో భారీ బిజినెస్ చేసినట్టు """/" / ఏపీ లోని వైజాగ్ అండ్ సీడెడ్ ఏరియాల్లోనే ఏకంగా 30 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టుగా ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది.

ఇంత బిజినెస్ జరిగింది నిజమే అయితే ఈ సినిమాకు భారీ టార్గెట్ సెట్ అయ్యేలా కనిపిస్తుంది.

ఇంత టార్గెట్ ఈ సినిమా రీచ్ అవుతుందో లేదో తెలియదు కానీ బిజినెస్ మాత్రం ఊహించని రేంజ్ లో జరుగుతుంది.

చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏం జరుగుతుందో.

Junior NTR: పది సెకన్ల సీన్ లో ఆరు ఎమోషన్లు.. తారక్ గొప్ప నటుడని చెప్పడానికి ప్రూఫ్ ఇదే!