పవన్‌ కళ్యాణ్‌ను పిలిచారట

సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా రాశిఖన్నా హీరోయిన్‌గా రూపొందిన ప్రతిరోజు పండుగే సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను 15వ తారీకున భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.మరో వైపు ప్రీ రిలీజ్‌ వేడుక కోసం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.

ఈ వేడుకకు ఎవరు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు అనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ ప్రీ రిలీజ్‌ వేడుక కోసం పవన్‌ కళ్యాణ్‌ను సంప్రదించారని సమాచారం అందుతోంది.

ఆయన కూడా ఓకే చెప్పాడట.ఈమద్య కాలంలో సినిమాలకు చాలా దగ్గరగా ఉంటు వస్తున్నాడు.

అందుకే ఈ సినిమా వేడుకలో పవన్‌ పాల్గొనడం కన్ఫర్మ్‌ అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

ఒక వేళ పవన్‌ హాజరు కాకుంటే రామ్‌ చరణ్‌ లేదా చిరంజీవి అయినా హాజరు అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.