బీహార్ సీఎంపై మరోసారి మండిపడ్డ ప్రశాంత్ కిషోర్

బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

బీహార్ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆయన సీఎం నితీష్ కుమార్‌పై మరోసారి ధ్వజమెత్తారు.

నితీష్ భ్రమపడుతున్నారని, వయస్సు మీదపడుతుండటంతో ఆ ప్రభావం కనిపిస్తోందని విమర్శించారు.ఏదో మాట్లాడాలని అనుకుంటాడని, కానీ ఇంకేదో మాట్లాడుతున్నారంటూ ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు.

చైనా: పార్ట్‌టైమ్‌ వర్క్ చేస్తున్న పెంపుడు జంతువులు.. శాలరీ ఏంటంటే..?