నా యూనివర్స్ నుంచి త్వరలోనే కొత్త తేజస్సు.. ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్!

టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ( Prashant Verma ) గురించి మనందరికీ తెలిసిందే.

తేజా సజ్జా( Teja Sajja ) హీరోగా నటించిన హనుమాన్ సినిమాతో ప్రతి ఒక్కరూ తన గురించి మాట్లాడుకునేలా చేసుకున్నారు.

ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ.

దీంతో ఆయన తదుపరి సినిమాలపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా ప్రశాంత్ వర్మ బాలయ్య బాబు ( Balayya Babu )తనయుడు మోక్షజ్ఞతో ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఆ విషయంపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా వర్మ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

"""/" / ఆ పోస్ట్ ప్రస్తుతం నందమూరి అభిమానులను జోష్ ని పెంచుతోంది.

ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వరుస సినిమాలు వస్తాయని ఇటీవల ఆయన చెప్పారు.

తాజాగా ఒక సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్‌ పెట్టిన ప్రశాంత్‌ వర్మ.

నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఒక కొత్త తేజస్సు రానుంది అని తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

దీనికి సింబా ఈజ్‌ కమింగ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు.దీంతో మోక్షజ్ఞ ( Mokshagna )ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్‌ ఈ పోస్ట్‌ పెట్టారని అందరూ అనుకుంటున్నారు.

సెప్టెంబర్‌ 6న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. """/" / ఇటీవల ప్రశాంత్‌ వర్మ పెట్టిన మరో పోస్ట్ కూడా సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఒక ఫొటో షేర్‌ చేస్తూ.ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నాను అని రాశారు.

దీని వెనక ఉన్న కథేంటని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.అయితే వర్మ చేసిన ఈ ట్వీట్లతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మోక్షజ్ఞతోనే సినిమా చేయబోతున్నాడు అందుకే ఇలా హింట్ ఇచ్చాడు అంటూ కామెంట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.

విశ్వం సినిమా సక్సెస్ అవుతుందా..? ఇది ఆడకపోతే గోపిచంద్ పరిస్థితి ఏంటి..?