నిర్ణీత గడువులోగా ప్రజావాణి అర్జీలు పరిష్కరించాలి – ప్రజావాణి లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలని  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయములోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు సోమవారం స్వీకరించారు.

ప్రజల నుంచి వచ్చే ప్రజా వాణి దరఖాస్తులు పెండింగ్ లో పెట్టవద్దని అధికారులను ఆదేశించారు.

కచ్చితంగా గడువులోగా పరిష్కరించాలని సూచించారు.సిరిసిల్ల, కోనరావుపేట, ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయాలు, సర్వే, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, సెస్, విద్యా, ఉపాధి, వ్యవసాయ శాఖలకు ఒకటి చొప్పున దరఖాస్తు వచ్చాయి.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?