ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమంను వేదికగా అధికారులకు భావించాలని అన్నారు.

ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 25 ఫిర్యాదులు, వినతులు వచ్చాయన్నారు .ఇందులో రెవెన్యూ -10, సర్వే -1, డిపిఓ - 3, ఎంసీ సిరిసిల్ల -4,ఎంపీడీఓ , తంగళ్లపల్లి -1,ఎల్ డి ఎం -1,ఎంప్లాయిమెంట్ - 1, డి సి హెచ్ ఎస్ - 1,ఎంసీ , వేములవాడ - 3, మొత్తం 25 ఫిర్యాదుల స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఇంచార్జి డి.

ఆర్.ఓ టి.

శ్రీనివాస్ , ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్3, గురువారం2024