ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ వారి త్రిమూర్తి శివ జయంతి ఉత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada ) పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ( Prajapita Brahmakumari Ishwariya ) వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన త్రిమూర్తి శివ జయంతి(శివరాత్రి) మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు.స్వామి వారి కృప,కరుణ,ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు.
శివరాత్రి ( Maha Shivratri ) ఉత్సవాల్లో భాగంగా శివ జయంతిని రోజులుగా జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తుందన్నారు.
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం వారు చేస్తున్న శాంతి బోధనలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు.
జ్ఞాన సూర్యుడైన శివ పరమాత్మ వర్తమాన సమయంలో ఈ సృష్టిపై అవతరించి మానవులలో అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తున్నారని అన్నారు.
యూకే నుంచి ఆస్కార్ బరిలో ‘సంతోష్ ’.. డైరెక్టర్ భారతీయురాలే!!