కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షోలో పవన్ కళ్యాణ్.. కానీ..?

బుల్లితెర యాంకర్ లలో సుమ కనకాల తర్వాత మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రదీప్ ముందుంటారు.

బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకరింగ్ నిర్వహించడమే కాకుండా జీ తెలుగులో 2014లో ప్రసారమైన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే షోకు నిర్మాతగా వ్యవహరించారు.

ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రెటీలను పిలిచి వారితో వారికి ఉన్న చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఎంతో ఎంటర్టైన్మెంట్గా సాగింది.

ఈ షో బాగా పాపులారిటీ సంపాదించుకోవడం తో ఏకంగా నాలుగు సీజన్లలో దాదాపు 113 సెలబ్రిటీలు పాల్గొన్నారు.

ఇప్పటివరకు ప్రసారమైన ఈ నాలుగు సీజన్లలో ప్రముఖ సినీ తారలు సందడి చేశారు.

మొదటి సీజన్లో వచ్చిన సెలబ్రిటీలు తర్వాత సీజన్లలో వచ్చినప్పటికీ ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా ఎంతో అలరించాయి.

అయితే ప్రస్తుతం ప్రదీప్ "కొంచెం టచ్ లో ఉంటే చెప్తా" సీజన్ 5 షో స్టార్ట్ చేయాలని భావించారు.

అయితే ఈ షో కు చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆహ్వానించాలని ఎంతో తాపత్రయ పడుతున్నారు.

పవన్ కళ్యాణ్ ను ఈ షోకు తీసుకురావడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్న ప్రదీప్ తాజాగా పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ షో గురించి చర్చించడం జరిగిందని తెలియజేశారు.

"""/"/ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా మరోవైపు రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్న పవర్ స్టార్ వీటన్నింటినీ వదులుకొని ప్రదీప్ షో కి రావడం ఎంతో గ్రేట్ అని చెప్పవచ్చు.

ఈ విధంగా 2017 వ సంవత్సరం లో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 లో కూడా పవర్ స్టార్ వస్తున్నారని చెప్పారు.

అయితే ఈసారి మాత్రం ప్రదీప్ షో కు పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈసారైనా ప్రదీప్ కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

26 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గిన కన్నడ హీరో దర్శన్.. ఆ ప్రమాదం ఉందంటూ?