ఢీ నుంచి తప్పుకుంటున్న ప్రదీప్.. ఇక షో నడవడం కష్టమే?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో ఢీ డాన్స్ షో ఒకటి.గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి ముందు ఉన్న స్థాయిలో రేటింగ్ రాలేదనే చెప్పాలి.

గతంలో ఈ వేదికపై సుధీర్ రష్మీ మెంటర్స్ గా తమదైన శైలిలో సందడి చేయడమే కాకుండా ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ సదా వంటి వారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ కార్యక్రమం నుంచి క్రమంగా ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోతున్నారు.

ఈ కార్యక్రమం నుంచి శేఖర్ మాస్టర్ తప్పుకోవడంతో అనంతరం సదా కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

వీరి స్థానంలో ప్రియమణి జానీ మాస్టర్ వంటి తదితరులు వస్తున్నారు.అదే విధంగా రష్మీ సుధీర్ కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం మిస్ అయిందని చెప్పాలి.

ఇకపోతే ప్రస్తుతం హైపర్ ఆది యాంకర్ ప్రదీప్ కామెడీతో ఈ కార్యక్రమం అరకొర రేటింగ్ సొంతం చేసుకుంటుంది.

"""/" / తాజాగా వచ్చే సీజన్ గురించి పెద్ద ఎత్తున ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వచ్చే సీజన్ కి వ్యాఖ్యాతగా యాంకర్ ప్రదీప్ కాకుండా ఇతరులను తీసుకోవాలనే ఆలోచనలో మల్లెమాల వారు ఉన్నట్లు తెలుస్తోంది.

యాంకర్ ప్రదీప్ అగ్రిమెంట్ ఈ సీజన్ తో పూర్తి కావడంతో అతని స్థానంలోకి కొత్త యాంకర్ వస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ యాంకర్ ప్రదీప్ సైతం ఈ కార్యక్రమం నుంచి తప్పకుంటే ఈ కార్యక్రమానికి వచ్చే కాస్త రేటింగ్స్ కూడా పూర్తిగా పడిపోతాయని చెప్పడంలో సందేహం పడాల్సిన పనిలేదు.

రీల్స్ పిచ్చి.. రీల్స్ కోసం బైక్‌పై డేంజర్ స్టంట్స్.. దెబ్బకి?