రాధేశ్యామ్ సినిమా కోసం కష్టపడిన ఆ స్టార్ లకు థాంక్స్ చెప్పిన ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.సౌత్ నుంచి నార్త్ వరకు ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

బాహుబలి సాహో సినిమా తర్వాత ప్రభాస్ సినిమా కావడంతో ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో ఈ సినిమా కోసం పలువురు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈక్రమంలోనే తెలుగులో ఎస్ ఎస్ రాజమౌళి వాయిస్ ఓవర్ ఇవ్వగా, కన్నడలో శివరాజ్ కుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

మలయాళంలో పృద్వి రాజ్ సుకుమార్, తమిళంలో సత్యరాజ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.హిందీలో అమితాబ్ బచ్చన్ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

"""/" / ఈ సినిమా కోసం స్టార్ సెలబ్రిటీలందరూ వాయిస్ ఓవర్ ఇవ్వగా చిత్రబృందం ఈ స్టార్ సెలబ్రిటీలకు గతంలోనే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ క్రమంలోనే హీరో ప్రభాస్ సైతం ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున థాంక్స్ తెలియజేస్తూ పోస్ట్ చేశారు.

ఈ స్టార్ సెలబ్రిటీలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ తమ అద్భుతమైన గాత్రాన్ని మా రాధే శ్యామ్ సినిమా కోసం అందించడం గౌరవంగా భావిస్తున్నాం.

ఈ సినిమాని మాతో పాటు ప్రేక్షకులకు ప్రత్యేకంగా అందించినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

పెరిగిపోతున్న కన్నప్ప బడ్జెట్.. మరి విష్ణు పరిస్థితి ఏంటి..?