రాధేశ్యామ్‌ అప్డేట్‌.. అడ్వాన్స్ బుకింగ్‌ గురించి సూపర్ న్యూస్‌

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వం లో రూపొందిన రాధేశ్యామ్‌ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పూర్తి ఏర్పాట్లు జరిగిపోయాయి.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవలే ముంబై లో భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే.

జాతీయ మీడియాలో విపరీతంగా కవరేజ్ ఇచ్చిన ఈ సినిమా కు ప్రమోషన్ ను ప్రస్తుతం చెన్నైలో నిర్వహిస్తున్నారు.

చెన్నై మహానగరం లో ప్రభాస్ మరియు పూజా హెగ్డే ల తో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు ప్రెస్ మీట్ లు మరియు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఏ స్థాయిలో అని ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఎప్పుడు ఎప్పుడూ అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతాయి అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఉన్నారు.

ఈ సమయం లో చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఒక క్లారిటీ వచ్చింది.

మరో మూడు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్ లు ప్రారంభం అవ్వబోతున్నట్లుగా ప్రకటించారు.అడ్వాన్స్ బుకింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను దాదాపుగా పది వేల స్క్రీన్స్ లో స్క్రీనింగ్‌ చేయబోతున్నట్లు గా ఇప్పటికే ప్రకటించడం జరిగింది.

"""/" / ఆ పదివేల స్క్రీన్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ని కూడా అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు.

సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే పాతిక కోట్ల వరకు ఈ సినిమా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కనీసం రూ.500 కోట్ల వరకు వసూలు చేస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సినిమా సూపర్ హిట్ అయితే అంతకు మించి వసూలు చేసే అవకాశం ఉంది.

వైరల్ వీడియో: పోలీస్ స్టేషన్లో డాన్స్ తో అదరగొట్టిన పోలీసులు..