'రాధేశ్యామ్‌' రిలీజ్ పుకార్లకు చెక్ పెట్టిన ప్రభాస్‌ టీమ్‌

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వం లో రూపొందిన రాధే శ్యామ్‌ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.

విడుదల తేదీ ని కూడా ప్రకటించారు.వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామంటూ అధికారికంగా ప్రకటించారు.

విడుదల తేదీ ని కూడా ఖరారు చేయడం వల్ల ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుందని అంతా అనుకున్నారు.

కాని సంక్రాంతికి విడుదల పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.తమిళ నటుడు రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెప్పారు.

దాంతో షూటింగ్‌ ఇంకా పూర్తి అవ్వలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఆ కారణంగానే సినిమా విడుదల విషయంలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి.

సమ్మర్ లో సినిమా అంటూ వచ్చిన వార్తలపై శ్రీ కృష్ణ అష్టమి సందర్బంగా విడుదల చేసిన పోస్టర్‌ తో క్లారిటీ ఇచ్చారు.

నేడు విడుదల అయిన కొత్త పోస్టర్ లో కూడా సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

సినిమా షూటింగ్‌ కేవలం రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

షూటింగ్‌ ముగించిన నేపథ్యంలో రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. """/"/ ప్రభాస్ మరియు పూజా హెగ్డే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు కలిగి ఉంది.

కనుక ఈ సినిమాను దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేస్తారని అంటున్నారు.

మొత్తానికి రాధే శ్యామ్‌ సినిమా షూటింగ్‌ ను ముగించిన తర్వాత కూడా చాలా రోజుల తర్వాత విడుదల చేయకుండా వాయిదా వేస్తున్నారు.

మూడు ఏళ్లుగాఈ సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.మరి ఇంకా ఎన్నాళ్లు వెయిట్‌ చేయాలనుకుంటున్న సమయంలో సంక్రాంతికే సినిమా విడుదల అవుతుందని తెలుస్తోంది.

కార్యకర్తలకు వందనం .. జగన్ ను నమ్ముతారా ?