అఫిషియల్ : మోస్ట్ అవైటెడ్ ‘ప్రాజెక్ట్ కే’ రిలీజ్ డేట్ ఫిక్స్!

బాహుబలి సిరీస్ భారీ విజయంతో ప్రభాస్ పేరు మారుమోగి పోయింది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

వరుస ప్లాప్స్ వస్తున్నా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు.

వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.

వరుస షూటింగులతో ఏ మాత్రం విశ్రాంతి లేకుండా గడుపుతున్న డార్లింగ్ త్వరలోనే కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో 'ప్రాజెక్ట్ కే' ఒకటి.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమా పాన్ వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా తెరకెక్కుతుంది.

500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఇందులో భాగం అయ్యారు.

"""/"/ ఈ సినిమా అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే నాగ్ అశ్విన్ ఏమాత్రం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్ కు సైతం అర్ధం కానీ పోస్టర్ ను రిలీజ్ చేసాడు.

దీంతో ఆ రోజు కూడా పెద్ద అప్డేట్ అనేది ఇవ్వలేదు.అయితే అనుకోకుండా ఈ రోజు బిగ్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసాడు.

"""/"/ ఈ రోజు మహా శివరాత్రి సందర్భంగా ప్రాజెక్ట్ కే నుండి నాగ్ అశ్విన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.

ప్రాజెక్ట్ కే సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న 2024లో రిలీజ్ చేయనున్నట్టు డేట్ లాక్ చేసారు.

దీంతో మొన్న ఆదిపురుష్ తో సంక్రాంతి మిస్ అయిన ప్రభాస్ వచ్చే ఏడాది మాత్రం ప్రాజెక్ట్ కే తో రాబోతున్నాడు.

ఇక ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా ఆసక్తిగా అనిపిస్తుంది.

చూడాలి వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఎంత మేర ఆకట్టు కుంటుందో.

తారకరత్న కుటుంబానికి ఎన్టీఆర్ చేసిన సాయం తెలుసా.. మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!