మిస్ యూ అంటూ పునీత్ ను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేసిన ప్రభాస్!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ ఆకస్మికంగా మరణించిన సంగతి మనకు తెలిసింది.

ఇప్పటికీ ఈయన మరణవార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలోనే పునీత్ రాజ్ మరణించిన తర్వాత ఆయన నటించిన చిత్రం జేమ్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.

ఈ క్రమంలోనే ఈ టీజర్ యావత్ సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇందులో పునీత్ యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆయన అభిమానులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా టీజర్ పై ప్రభాస్ స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ చిత్రం పై స్పందిస్తూ.

జేమ్స్ రూపంలో ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాము.పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్ ను అభిమానించే లక్షలాది మంది అభిమానులకు ఈ సినిమా ఇప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది.

మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము.మిస్ యూ పునీత్ సర్ అంటూ ఆయన గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

"""/"/ ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే జేమ్స్ చిత్రం త్వరలోనే విడుదల కావడంతో ఈ సినిమా కోసం పునీత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ప్రభాస్ విషయానికి వస్తే త్వరలోనే పూజా హెగ్డే ప్రభాస్ జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సిట్ అధికారుల విచారణకు సహకరిస్తా..: ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ