రాధేశ్యామ్ మరీ హద్దులు దాటినట్లుంది, అక్కడ ఆడకుంటే కష్టమే
TeluguStop.com
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న రాధే శ్యామ్ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.
ఈ సినిమా దాదాపుగా 250 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్నట్లుగా మొదటి నుండి వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఆ మొత్తం కూడా చాలా ఎక్కువ అయినట్లుగా తెలుస్తోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాధేశ్యామ్ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.
300 కోట్లను మించింది అంటున్నారు.భారీ బడ్జెట్ తో పాటు సినిమా లో ఉన్న స్టైలిష్ ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి అంటూ టాక్ వస్తుంది.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా నమోదు చేస్తే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే మూడు వందల కోట్లను ఖర్చు చేసిన నిర్మాతలు మరో పది కోట్ల వరకు సినిమా విడుదల అయ్యే వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ రేంజ్ లో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాకు ఖర్చు చేయడం పట్ల అంతా కూడా నోరు వెళ్ల బెడుతున్నారు.
ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ వేసిన కాస్ట్యూమ్స్ ఖర్చు ఏకంగా 6.
5 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు.ఈ రేంజ్ లో ఖర్చు చేయడం అంటూ మామూలు విషయం కాదు.
భీకరమైన ఈ ఖర్చుకు అంతా కూడా అవాక్కు అవుతున్నారు.బాహుబలి ని మించి సాహో కు ఖర్చు చేసినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు సాహో ను మించేలా రాధే శ్యామ్ కు ఖర్చు చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నారు.
బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటీ అంటే ఈ సినిమా విడుదలకు ముందే అన్ని భాషలకు కలిపి దాదాపుగా 400 కోట్ల బిజనెస్ చేస్తుందని నమ్ముతున్నారు.
ఒక వేళ ఈ సినిమా ఉత్తర భారతంలో ఆకట్టుకోకుంటే ఖచ్చితంగా నిర్మాతలకు భారీ నష్టం తప్పదంటున్నారు.
ఏపీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందించిన కేటీఆర్..!!