సాహో డైరెక్టర్ తో ప్రభాస్ మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అన్ని భారీ బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలను తీస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు.

ప్రభాస్ ఇప్పటికే రాధేశ్యామ్ షూట్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేసాడు.

ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణముగా వాయిదా వేస్తూ వచ్చారు.

ఈ సినిమా ఈ మధ్యనే 2022 సంక్రాంతికి విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా శృతి హాసన్ నటిస్తుంది.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ సినిమా కూడా బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. """/"/ ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా కూడా చేస్తున్నాడు.

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.

ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. """/"/ ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.

ప్రభాస్ అటు సలార్ సినిమా షూటింగ్ చేస్తూనే ఇటు ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటూ బిజీగా ఉన్నాడు.

అయితే తాజాగా ప్రభాస్ మరొక సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ ఇంతకుముందు చేసిన సాహో సినిమా డైరెక్టర్ సుజిత్ తో మరొక సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

సాహో సినిమా ప్లాప్ అయినా కూడా ప్రభాస్ మరొకసారి సుజిత్ కు అవకాశం ఇస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఈసారి సుజిత్ తీస్తున్న సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం.

ఈ సినిమా కథ సుజిత్ ప్రభాస్ కు వినిపించగా ఆయనకు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రస్తుతం సుజిత్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో నిమగ్నం అయ్యాడని టాక్.

భారతీయులకు కొత్తగా 2.5 లక్షల యూఎస్ వీసా అపాయింట్‌మెంట్‌లు.. స్పందించిన కమ్యూనిటీ నేత!