రేపటి నుండి ప్రభాస్ 'ప్రాజెక్ట్‌ కే'.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన రాధే శ్యామ్‌ విడుదలకు సిద్దం అయ్యింది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా సంక్రాంతికి వస్తుంది.ఇదే సమయంలో ఆయన ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ ను కూడా ముగించాడు.

రాబోయే ఆరు నెలల పాటు ఆ సినిమా యొక్క మోషన్ గ్రాఫిక్స్ వర్క్ జరుగబోతుంది.

ఇక సలార్‌ సినిమా చిత్రం ఇప్పటికే సగం షూటింగ్‌ పూర్తి అయ్యింది.ఆదిపురుష్ ను ముగించిన తర్వాత ప్రభాస్ సలార్‌ పని పూర్తి చేస్తాడని అంతా భావించారు.

కాని అనూహ్యంగా ఆయన ప్రాజెక్ట్‌ కే సినిమాను మొదలు పెట్టాడు.ఇప్పటికే అమితాబచ్చన్ పై ఒక షెడ్యూల్‌ ను పూర్తి చేశారు.

ప్రభాస్ పై ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌ కే క్లాప్‌ పడలేదు.ఈ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

షూటింగ్‌ ను రేపటి నుండి ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.మొదటి షెడ్యూల్‌ పూర్తి గా అమితాబచ్చన్ పై మాత్రమే చిత్రీకరించారు.

రెండవ షెడ్యూల్‌ ను ప్రభాస్ మరియు దీపిక పదుకునే ల పై చిత్రీకరించబోతున్నట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి ప్రాజెక్ట్‌ కే షూటింగ్‌ పునః ప్రారంభం అవ్వడం అభిమానులకు ఆనందం కలిగించే విషయం.

పెద్ద ఎత్తున సినిమా ను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నాడు.సినిమా చిత్రీకరణ మొదలు పెట్టక ముందు నుండే అంచనాలు పీక్స్‌ లో ఉన్నాయి.

"""/" / కనుక ఈ సినిమా ఖచ్చితంగా గ్లోబల్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం ను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ గా ప్రభాస్ ఇప్పటికే చాలా సినిమాలను దక్కించుకున్నాడు.కనుక ఈ సినిమా మరింత భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం అందరిలో కనిపిస్తుంది.

ఈ సినిమా వైజయంతి మూవీస్ వారు 500 కోట్ల బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు.

హాలీవుడ్‌ లో కూడా ఈ సినిమా విడుదల చేస్తారట.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!