వచ్చే ఏడాది ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతున్న స్టార్ హీరోలు వీళ్లే?

టాలీవుడ్ స్టార్ హీరోలు గతంతో పోలిస్తే సినిమాల విషయంలో వేగం పెంచారు.కొందరు టాలీవుడ్ హీరోల సినిమాలు విడుదలై మూడు సంవత్సరాలు కావడంతో ప్రేక్షకులు ఆయా హీరోల సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

2022 సంవత్సరంలో కొందరు టాలీవుడ్ హీరోలు కనీసం మూడు సినిమాలు రిలీజయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.

ఈ మూడు సినిమాల షూటింగ్ పనులు వేగంగా జరుగుతుండటంతో వచ్చే ఏడాది ప్రభాస్ ట్రిపుల్ ధమాకా పక్కా అని చెప్పవచ్చు.

మరోవైపు చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య వచ్చే ఏడాదికి వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

చిరు తనయుడు రామ్ చరణ్ కూడా సినిమాల విషయంలో వేగం పెంచారు.వచ్చే ఏడాది చరణ్ నటించిన ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాటు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ , హరిహర వీరమల్లు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

పవన్ హరీష్ కాంబో మూవీ కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలుస్తోంది.

"""/"/ 2020, 2021 సంవత్సరాలలో పెద్ద హీరోల సినిమాలు లేక ఎంటర్టైన్మెంట్ ను మిస్ అయిన ప్రేక్షకులకు వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ఎంటర్టైన్మెంట్ దొరకనుంది.

ముగ్గురు మెగా హీరోలు వచ్చే నెలలో ఊహించని స్థాయిలో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందించనున్నారు.

అయితే అనుకున్న విధంగా ఈ సినిమా రిలీజవుతుందో లేదో చూడాల్సి ఉంది.

త్వరలోనే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ… రేసులో ఉంది వీరే ?