ప్రభాస్ గ్రేట్ అంటున్న ఫ్యాన్స్.. ఆ దర్శకుని కూతురు కోసం ఏకంగా అన్ని చాక్లెట్స్ పంపారా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.

ప్రభాస్ తో పని చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు.

ముఖ్యంగా ఆయన రాజ మర్యాదల గురించి అలాగే ఆయన ఇంటి భోజనం గురించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే.

షూటింగ్ కి వచ్చిన సెలబ్రిటీలకు తన ఇంటికి ఎవరు వచ్చినా ఎన్నో రకాల వెరైటీలతో ఫుడ్ పెడుతూ ఉంటారు ప్రభాస్.

ప్రభాస్ పెట్టె ఫుడ్ గురించి అందరూ గొప్పగా చెప్తారు. """/" / ఫుడ్ విషయంలో మాత్రం ప్రభాస్ అస్సలు తగ్గేదేలే అన్నట్టు తెప్పిస్తాడని సెలబ్రిటీలు చెప్తారు.

ఇక ఆ సంగతి పక్కన పెడితే ఇటీవలే కల్కి సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి సినిమా రాజాసాబ్ మూవీలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా సగం షూటింగ్ అవ్వగా ఆగస్టు నుంచి రాజాసాబ్( Rajasaab Movie ) షూటింగ్ మళ్ళీ మొదలవ్వనుంది.

తాజాగా రాజాసాబ్ షూటింగ్ లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనని డైరెక్టర్ మారుతి కూతురు తెలిపింది.

డైరెక్టర్ మారుతి కూతురు హియ( Hiya_ కూడా రాజాసాబ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది.

"""/" / తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న హియ మీడియాతో రాజాసాబ్ షూటింగ్, ప్రభాస్ గురించి మాట్లాడుతూ.

ప్రభాస్ చాలా సరదాగా ఉంటారు.సెట్ లో ప్రభాస్ ఉంటే ఈజీగా తెలిసిపోతుంది.

బాహుబలి నుంచి నేను ప్రభాస్ అభిమానిని.ఆయన సినిమాలు రిలీజ్ రోజు చూడాల్సిందే.

నేను రాజాసాబ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నాను.ఒకరోజు సెట్ లో నాకు చాక్లెట్ కావాలని నా పక్కనున్న వాళ్ళతో అరిచాను.

అది ప్రభాస్ కి ఎలా తెలిసిందో కానీ కాసేపట్లో ప్రభాస్ ఒక ప్లేట్ నిండా చాక్లెట్స్ తీసుకొచ్చి నా ముందు పెట్టి నీకు ఏం కావాలో తీసుకో అని చెప్పారు.

ఫుడ్ విషయంలో అంతలా ఉంటారు అని తెలిపింది.దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఫుడ్ విషయంలో ప్రభాస్ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అని మరోసారి అభినందిస్తున్నారు.

కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు…