ప్రభాస్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న సెంటిమెంట్.. ఏంటంటే..?

ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి కేజీఎఫ్ 2 సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఒక సెంటిమెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను భయాందోళనకు గురి చేస్తోంది.సలార్ సినిమా సింగరేణి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుని ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే గతంలో ఈ ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న కొన్ని తెలుగు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా ఈ సెంటిమెంట్ భయం వెంటాడుతోంది.గతంలో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ లో తెరకెక్కిన నిప్పురవ్వ సినిమా సింగరేణిలో షూటింగ్ జరుపుకుంది.

ఎ కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ సింగరేణి గనుల్లో షూటింగ్ జరుపుకోగా బాలకృష్ణ సింగరేణి కార్మికుడిగా సినిమాలో కనిపించారు.

బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం గమనార్హం.దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా హీరోగా తెరకెక్కిన లీడర్ సినిమా కూడా సింగరేణి గనుల్లో షూటింగ్ జరుపుకుంది.

ఈ సినిమాలో రానాకు జోడీగా ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ్ నటించారు.ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

"""/"/ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా షూటింగ్ కూడా సింగరేణి గనుల్లో జరుగుతోంది.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఎస్ రామారావు నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

ప్రభాస్ సలార్ సినిమా ఈ సెంటిమెంట్లను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

Viral Video: 102 ఏళ్లలో కూడా కుర్రాళ్ల‌తో క్రికెట్ ఆడుతున్న క‌శ్మీరీ తాత‌..