పండుగకు ‘ఆదిపురుష్’ నుండి అదిరే ట్రీట్.. డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) చేస్తున్న సినిమాలకు భారీ డిమాండ్ ఉంది.

ఈయన సినిమా అంటే నిర్మాతలు సైతం భారీ బడ్జెట్ పెట్టడానికి క్యూ కడుతున్నారు.

బాహుబలి( Bahubali ) సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫాలోయింగ్ తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం రేసులో వెనక్కి నెట్టాడు.

మరి ఈ సినిమా తర్వాత ఒకేసారి ఐదారు పాన్ ఇండియన్ సినిమాలను లైన్లో పెట్టాడు.

ప్రెజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'ఆదిపురుష్'( Adipurush ) ఒకటి.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om Raut ) తెరకెక్కించాడు.

రామాయణం తెరకెక్కించడం కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు సమాచారం.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడి నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్( Kriti Sanon ) సీతగా నటించింది.

"""/" / అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.

మంచి అంచనాలు పెరిగిన సమయం లోనే టీజర్ వచ్చి ఈ సినిమాపై ఆడియెన్స్ లో నిరాశ కలిగేలా చేసింది.

అప్పటి నుండి ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఓం రౌత్ పై గుర్రుగా ఉన్నారు.

దీంతో రిలీజ్ సైతం వాయిదా పడింది.ఇక కొత్త రిలీజ్ డేట్ ను జూన్ 16కు మార్చారు.

"""/" / మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే మేకర్స్ నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తూ కంగారు పడుతున్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ రామనవమి రోజు నుండి స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

అదిరే ట్రీట్ తో స్టార్ట్ చేస్తారని టాక్ రావడంతో ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు.

పత్తి పంటను కత్తెర పురుగుల బెడద నుండి సంరక్షించే యాజమాన్య పద్ధతులు..!