ఫ్యాన్స్ కు నిరాశ... ప్రాజెక్ట్‌ కే మొత్తం సీక్రెట్‌

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమా చిత్రీకరణ నేటి నుండి ప్రారంభం కాబోతుంది.

కొన్ని నెలల క్రితమే ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తి అయ్యింది.ఆ షెడ్యూల్‌ పూర్తిగా అమితాబచ్చన్‌ పైనే సాగింది.

ఇప్పుడు ప్రభాస్ మరియు దీపిక పదుకునేలు ఇతర చిత్ర నటీ నటులు షూటింగ్ లో జాయిన్‌ అవ్వబోతున్నారు.

పాన్ వరల్డ్‌ మూవీగా మహా నటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయితే సినిమా లో ప్రభాస్ లుక్ ఏంటీ అనేది వెంటనే తెలిసి పోతుందని.

లీక్‌ ద్వారా లేదా ఆన్‌ లొకేషన్‌ స్టిల్ ద్వారా ప్రభాస్ లుక్‌ రివీల్‌ అవ్వడంతో సినిమా స్థాయి మరింత పెరుగుతుందని అభిమానులు ఆశ పడుతున్నారు.

"""/" / తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అభిమానులకు నిరాశ కలిగించబోతుంది.

ఎందుకంటే అభిమానులు కోరుకున్నట్లుగా ఈ సినిమా నుండి లీక్ కాని మరేదైనా కాని రాబోవడం లేదు.

సినిమా లో ప్రతి సన్నివేశాన్ని సీక్రెట్ గానే ఉంచబోతున్నారు.లొకేషన్ లో ఫోన్ లు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

మహానటి సినిమా సందర్బంగా కూడా మేకర్స్‌ చాలా జాగ్రత్తలు పాటించారు.ఆ సమయంలో సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయం బయటకు వెళ్లనివ్వలేదు.

లీక్‌ అన్న మాట లేకుండా జాగ్రత్త పడ్డారు.ప్రాజెక్ట్‌  కు కూడా అంతే జాగ్రత్తలను మేకర్స్ తీసుకోబోతున్నారు.

నాగ్‌ అశ్విన్‌ ఎప్పుడు ప్రభాస్ లుక్ ను రివీల్ చేయాలని భావిస్తాడో అని ఎదురు చూడాల్సిందే తప్ప లీక్‌ తో ఎంజాయ్ చేద్దామని అభిమానులు అనుకోవడం వృదా.

KCR : పరామర్శల యాత్ర మొదలుపెట్టనున్న కేసీఆర్