ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్ వైరల్.. నా చావుకు కారణం ఆయనే అంటూ?

బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగారు.రాజమౌళి ఆ సినిమా ద్వారా ప్రభాస్ కు ఊహించని స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టారు.

దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో బాహుబలిని మించిన విజయాన్ని అందుకుంటారా? లేదా? అనే ప్రశ్నకు సరైన సమాధానం తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

మరోవైపు కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రభాస్ సినిమా విడుదలై రెండేళ్లు గడిచిపోయింది.

రాధేశ్యామ్ సినిమా 2022 సంవత్సరం జనవరి 14వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమా నుంచి పాటలు రిలీజ్ కాకపోవడంతో ప్రేక్షకులు నిరాశతో ఉన్నారు.

తాజాగా ఒక అభిమాని రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల తాను సూసైడ్ చేసుకుంటున్నానని లేఖ రాయగా ఆ లేఖ నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.

అభిమాని లెటర్ లో ఇప్పటివరకు ఒక లేఖ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదని పేర్కొన్నారు.

రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల లెటర్ రాయక తప్పడం లేదని అభిమాని వెల్లడించారు.

"""/"/ తన చావు చూసైనా రాధేశ్యామ్ మేకర్స్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తారని భావిస్తానని అభిమాని పేర్కొన్నారు.

చాలారోజులు ఎదురుచూసేలా చేశారని మేము ఎదురుచూశామని ఇక చాలు అంటూ అభిమాని ఆందోళన చెందుతూ సూసైడ్ లెటర్ లో వెల్లడించారు.

"""/"/ రాధేశ్యామ్ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ, యూవీ క్రియేషన్స్ బృందం తన చావుకు కారణమని అభిమాని కామెంట్లు చేశారు.

ఫ్యాన్స్ ఎమోషన్లతో రాధేశ్యామ్ చిత్రయూనిట్ ఆడుకోవద్దని అభిమాని అన్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో లెటర్ వైరల్ అవుతుండగా రాధేశ్యామ్ మేకర్స్ ఈ లెటర్ గురించి ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది.

దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

స్వాతంత్ర్యం అంటే ఇదేనా… గౌరవం ఎక్కడ ఉంది.. ఉపాసన పోస్ట్ వైరల్!