ఆ విషయంలో రాజీపడని ప్రభాస్.. ప్రతి సినిమాలో తప్పనిసరి?

ఒక చేతితో చప్పట్లు మోగవనే విషయం అందరికీ తెలిసిందే.ఆ చెయ్యికి మరో చెయ్యి తోడైతేనే పెద్ద ఎత్తున శబ్దం వస్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ కూడా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నాడు.ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

ఇకపోతే ఈయన సినిమాలు కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి విజయాన్ని సాధించాలంటే నార్త్ లో బాగా మార్కెట్ ఉన్న హీరోయిన్లను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈయన బాహుబలి తర్వాత నటించిన సాహో సినిమా నుంచి బాలీవుడ్ భామలను తన సినిమాలలో హీరోయిన్లుగా ఉండాలని భావిస్తున్నారట.

అందుకే ప్రభాస్ నటించిన సాహో సినిమాలో కూడా బాలీవుడ్ హీరోయిన్లను రంగంలోకి దించారు.

అలాగే ప్రస్తుతం ఈయన నటిస్తున్న ప్రాజెక్టు కె వంటి సినిమాలలో కూడా బాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అధికంగా మార్కెట్ ఉన్న హీరోయిన్లతో సినిమా చేస్తే కలిసి వస్తుందనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారు.

అందుకే హీరోయిన్ల విషయంలో ఏమాత్రం కాంప్రమైస్ కావడంలేదని తన సినిమాలలో తప్పనిసరిగా బాలీవుడ్ హీరోయిన్స్ ఉండాలని ఆలోచన చేస్తున్నారట.

"""/"/ ఇకపోతే ఆది పురుష్ సినిమాలో సైతం కృతి సనన్ నటిస్తున్నారు.అర్జున్ రెడ్డి ఫెమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ సినిమాలో కరీనాకపూర్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ప్రకటన వెలువబడలేదు కానీ ఈ సినిమాలో కరీనాకపూర్ కాకపోయినా మరొక బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకొని ఆలోచనలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.

మొత్తానికి ప్రభాస్ ఫాన్ ఇండియా హీరో అయిన తర్వాత తన సినిమాలలో స్టార్ హీరోయిన్లకే అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది.

ఫొటోలు వైర‌ల్: భ‌ర్త బాగుండలంటూ అట్లతద్ది పూజ‌ చేసిన స్నేహరెడ్డి..