బ్రేకింగ్‌ : నేటి నుండి ప్రభాస్‌.. నాగ్‌ అశ్విన్ ల మూవీ షూటింగ్‌

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబిత పెద్దగా ఉంది.రాధే శ్యామ్‌ షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.

మరో వైపు సలార్‌ మరియు ఆదిపురుష్‌ లు షూటింగ్‌ దశలో ఉన్నాయి.ఈ మూడు సినిమాలు కాకుండా తెలుగు ప్రేక్షకులతో పాటు అందరి దృష్టి కూడా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా పై ఉంది.

ఆ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు.

కాని జులైలో అమితాబచ్చన్‌ తో షూట్‌ చేసేందుకు డేట్లు తీసుకున్నారు.కాని ఇప్పుడు ఆయన డేట్లు మార్చుకునేందుకు నిరాకరించడంతో తప్పని సరి పరిస్థితుల్లో సినిమా ను మొదలు పెట్టాల్సి వచ్చిందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేక సెట్టింగ్‌ లో అమితాబచ్చన్‌ పై నేటి నుండి షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.

ఈ విషయాన్ని మీడియా వర్గాల వారికి కూడా యూనిట్‌ సభ్యులు షేర్‌ చేయలేదు.

అమితాబచ్చన్‌ ట్వీట్‌ చేయడం వల్ల తెలిసింది.నేడు రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్ ల కాంబో సినిమా పట్టాలెక్కబోతున్న నేపథ్యంలో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించబోతున్నారు.రికార్డు స్థాయిలో ఈ సినిమాకు ఖర్చు పెట్టబోతున్నారు.

అయిదు వందల కోట్లకు తగ్గకుండా ఈ సినిమాను ఖర్చు చేస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

"""/"/ ఖచ్చితంగా ఈ సినిమా పాన్‌ వరల్డ్‌ మూవీగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

పదుల సంఖ్యలో ఈ సినిమా కోసం హాలీవుడ్‌ టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు.ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్‌ ను హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసిన సంస్థలకు అప్పగించబోతున్నారు.

నేడు మొదటి షెడ్యూల్‌ ను మొదలు పెడుతున్న కారణంగా తదుపరి షెడ్యూల్‌ కూడా వెంటనే ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్ట్ , జస్టిన్ ట్రూడో ఫస్ట్ రియాక్షన్