ప్రభాస్, గోపి చంద్ కాంబినేషన్ లో పూరి సినిమా ఎందుకు ఆగిందో తెలుసా ?

సినిమాల్లో ఒకరి మధ్య మరొకరికి ఎల్లప్పుడూ పోటీ వాతావరణ ఉంటుంది.కానీ సినిమా పక్కన పెడితే వారు నిజ జీవితంలో ఎంతో స్నేహంగా ఉంటారు.

అలా సినిమాలో నటించకపోయినా ఎంతో స్నేహంగా ఉండే వారు ఉన్నారు.అయితే వర్షం సినిమాలో ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటించి స్నేహం గా మెలుగుతున్న వారు ప్రభాస్ మరియు గోపీచంద్.

ఈ చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో మనందరం చూసాం.వీరి స్నేహం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే.

ఒకరి కోసం మరొకరు అన్న విధంగా వీరి స్నేహం ఉంటుందని అందరూ అంటూ ఉంటారు.

అయితే వీరిద్దరినీ కలిపి హీరోలుగా సినిమా తెరపై చూడాలని వీరిద్దరి అభిమానులు కోరుకోవడంలో ఎలాంటి తప్పులేదు.

అయితే అలాంటి ఒక ప్రయత్నం జరిగింది అనే విషయమే ఎవరికీ తెలీదు.బాలీవుడ్ లో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయినా షోలే సినిమాని మీకందరికీ గుర్తు ఉండే ఉంటుంది.

ఈ సినిమాని తెలుగులో ప్రభాస్ గోపీచంద్ హీరోలుగా పెట్టి రీమిక్స్ చేయాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ అనుకున్నారట.

ఈ క్రమంలో ఇండస్ట్రీలో వర్షం సినిమా తర్వాత ఈ వార్తలకు జోరందుకుంది.కానీ ఎందుకు ఆగిందో తెలియదు కానీ ఈ విషయం కార్యరూపం దాల్చలేదు.

షోలే ఇలాంటి ఒక హెల్త్ క్లాసిక్ సినిమా జోలికి వెళ్లడం మంచిది కాదు అని భావించారో ఏమో కానీ పూరి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట.

అయితే షోలే సినిమాని వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆగ్ అనే పేరుతో హిందీలో తీసి అట్టర్ ఫ్లాప్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

"""/" / ఒకే థియేటర్లో ఎక్కువ రోజులు ఆర్డిన సినిమాగా తొలుత షోలే ఎన్నో కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంది.

దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా విడుదల అయ్యేంతవరకు కూడా ఈ రికార్డు షోలే సినిమా పేరు తో ఉంది.

ఇక షోలే సినిమాలో అమితాబచ్చన్, ధర్మేంద్ర, సంజీవ్ కుమార్ హీరోలుగా నటించగా, హేమామాలిని, జయ మాధురి, అంజాద్ ఖాన్ వంటి వారు ముఖ్యపాత్రలో నటించారు.

రమేష్ సిప్పి ఈ చిత్రానికి దర్శకత్వ వహించారు.ఇక షోలే లాంటి సినిమా మళ్లీ ఏ భాషలో నువ్వు విడుదల కాకపోవడం.

కురులకు కొండంత అండగా నిలిచే కుంకుడు కాయలు.. ఇలా వాడితే అదిరిపోయే లాభాలు!