ఎల్లారెడ్డిపేట మండలంలో వేగంగా పుంజుకుంటున్న హస్తం

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో హస్తం రోజురోజుకు వేగంగా పుంజుకుంటుంది.

మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో హరి భూషణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటింటా ప్రచారం చేపట్టారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ హామీల గురించి గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది.

సందర్భంగా హరి భూషణ్ ఆధ్వర్యంలో బిజెపి నుండి గ్రామ శాఖ అధ్యక్షులు కనకట్ల మల్లేశం, వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని ఆయన అన్నారు.

కేకే మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలను కోరారు.

ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుచరులు ఉన్నారు.

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక నిర్ణయం