పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ రాయలసీమకు వరం
TeluguStop.com
పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ రాయలసీమకు వరమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.పోలవరంను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.
ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది సీఎం జగన్ ధ్యేయమని తెలిపారు.రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల వద్ద గేట్లకు మరమ్మతులు చేపడుతున్నామన్నారు.
అనంతరం చంద్రబాబుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందన్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరువుతో రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారని చెప్పారు.జగన్ సీఎం అయ్యాక రైతుల కష్టాలు తీరాయని మంత్రి అంబటి స్పష్టం చేశారు.
బాహుబలి2 స్థాయిలో ఆ సీక్వెల్స్ మెప్పు పొందుతాయా.. దేవర2, కల్కి2, పుష్ప2 పరిస్థితేంటి?