Posani Krishna Murali : పవన్ పై పోటీ చేస్తే నాకు డిపాజిట్లు రావు.. పోసాని కామెంట్లు వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు,దర్శకుడు రచయిత పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇటీవల కాలంలో ఈయన తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

సినిమాలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించిన విషయాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా కూడా వ్యంగ్యంగా స్పందిస్తూ ఉంటారు.కాగా చాలా కాలం నుంచి పోసాని వైసీపీ, వైఎస్ జగన్ మద్దతు దారుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

రాజకీయ పరమైన అంశాలపై సైతం పోసాని ప్రత్యర్థులపై విరుచుకుపడడం చూస్తూనే ఉన్నాము. """/" / అయితే సీఎం జగన్( CM Jagan ) పోసానిని ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే.

పోసాని ప్రస్తుతం వైసీపీ పార్టీలో జగన్ కి వీర విధేయుడిగా మారారు.ప్రత్యర్థులపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు పోసాని.

తాజాగా పోసాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.పోసాని తరచుగా పవన్ కళ్యాణ్ పై కూడా విరుచుకుపడడం చూస్తూనే ఉన్నాం.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటించిన గోకులంలో సీత చిత్రానికి పోసాని రచయిత.

అలాగే పవన్ తో కలసి పోసాని పలు చిత్రాల్లో నటించారు కూడా.సినిమా పరంగా పవన్ తో అనుబంధం ఉన్నప్పటికీ పాలిటిక్స్ విషయానికి వస్తే మాత్రం పోసాని నోటికి పని చెబుతుంటారు.

"""/" / ఇకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ పై పోటీకి దింపేందుకు వైసీపీ సరైన కాండిడేట్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో పోసాని పేరు కూడా వినిపిస్తోంది.దీనిపై పోసాని తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు.

పవన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ బరిలోకి దిగేందుకు పోసాని సిద్ధంగా ఉన్నారనే రూమర్స్ పై స్పందించారు.

పవన్ పై పోటీ చేయమని నాకు సీటు ఇస్తే ఖచ్చితంగా నో చెబుతాను ఎందుకంటే నేను అంత పిచ్చోడిని కాదు.

నేను పవన్ అంత పెద్ద స్టార్ ని కాదు.సామాన్యుడిని.

పవన్ పై నేను పోటీ చేస్తే గెలిచేది అతడే.నాకు డిపాజిట్లు కూడా కష్టమే.

అలాంటప్పుడు నేనెందుకు పోటీ చేస్తాను.అంత అమాయకుడిని కాదు అని పోసాని చెప్పుకొచ్చారు.

అలాగే చంద్రబాబు విషయంలో కూడా పోసాని ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ ని నేను ఎప్పుడో హెచ్చరించాను.

పదవి కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు.ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి పవన్ కళ్యాణ్ ఒక లెక్కా అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చదివిన ఐఐటీకి 228 కోట్ల రూపాయల భారీ విరాళం.. ఈ వ్యక్తి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!