జూనియర్ ఎన్టీఆర్ ను అనాథలా చూశారు.. పోసాని సంచలన వ్యాఖ్యలు..?

ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.

కొన్నేళ్ల క్రితం గుంటూరు వెళ్లే దారిలో ఒక మీటింగ్ జరిగిందని ఆ మీటింగ్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డయాస్ పై కూర్చుకున్నారని అక్కడే జనాల్లో హరికృష్ణ వాళ్ల అబ్బాయి కూర్చున్నారని పోసాని అన్నారు.

2014లో చంద్రబాబు పార్టీ గెలవడానికి పవన్ కూడా కారణం కాబట్టి చంద్రబాబు పవన్ ను చాలాచాలా మెచ్చుకున్నారని పోసాని తెలిపారు.

తర్వాత అదే పవన్ కళ్యాణ్ లోకేష్ అవినీతిపరుడని ఇంకెంత సంపాదిస్తాడని కామెంట్లు చేయగా ఆ సమయంలో టీడీపీ నేతలు పవన్ పై విమర్శలు చేశారని పోసాని పేర్కొన్నారు.

చంద్రబాబును పొగిడితే మాత్రమే టీడీపీలో స్థానం ఉంటుందని లేకపోతే ఉండదని పోసాని పేర్కొన్నారు.

2009 సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ ఎలక్షన్ క్యాంపెయిన్ కు వెళితే జూనియర్ ఎన్టీఆర్ ను చూడటానికి జనం బాగా వచ్చారని ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఉందని పోసాని అన్నారు.

"""/"/ అయితే అలా ప్రజాదరణ ఉన్నవాళ్లను చంద్రబాబు ఉంచుకోరని ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనక ముందు లోకేష్ తో సహా చాలామంది జూనియర్ ఎన్టీఆర్ పై ద్వేషం చూపించే వారని ఎన్టీఆర్ ను ఒక అనాథలా చూసేవాళ్లంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టాప్ హీరో అయ్యాడని ఎన్టీఆర్ గెలవడానికి ఉపయోగపడాలే తప్ప మన దగ్గర ఉండకూడదని చంద్రబాబు అప్పట్లో భావించాడని పోసాని తెలిపారు.

ప్రస్తుతం పార్టీ ఓడిపోతుందని మళ్లీ ఎన్టీఆర్ ను చేరదీసే ప్రయత్నం చేస్తున్నారని పోసాని అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కు ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి రాడని పోసాని కృష్ణమురళి చెప్పారు.

పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇదేందయ్యా ఇది.. పైకి పాకుతున్న నది నీరు.. వీడియో చూస్తే నమ్మలేరు..