జనాభా ప్రాతిపదిక పద్మశాలిలకు 10-12 స్థానాలు:పెండెం ధనుంజయ్ నేత

నల్లగొండ జిల్లా:జనాభా దామాషా ప్రాతిపదిక రాష్ట్రంలో పద్మశాలిలకు 10 నుండి12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి బీఎస్పీ సిద్దంగా ఉన్నదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇంచార్జీ పెండం ధనుంజయ్ నేత తెలిపారు.

హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్ అధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కలిసి జనాభా ప్రాతిపదిక పద్మశాలిలకు 10-12 స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.

సెప్టెంబర్ మూడో వారంలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, తప్పకుండా పద్మశాలిలకు 10-12 స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ స్పష్టం చేశారని అన్నారు.

వామ్మో.. ఒంటికి వ్యాయామం లేకుంటే ఇన్ని సమస్యలు వస్తాయా?