Poonam Pandey : పూనమ్ పాండేకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలిస్తే నోరెళ్లబెడతారు…
TeluguStop.com
ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే( Model Poonam Pandey ) ఫిబ్రవరి 2వ తేదీన మరణించినట్లు ఆయన మేనేజర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
32 ఏళ్ల వయసులోనే ఆమె చనిపోయినట్లు ఆయన ప్రకటన చేయడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది.
గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్ బారిన పడి ఆమె కన్నుమూసినట్లు తెలిపాడు మేనేజర్.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తాను బతికే ఉన్నానంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో షేర్ చేసింది.
సర్వైకల్ క్యాన్సర్( Cervical Cancer ) గురించి అవగాహన కల్పించడానికే ఆ వ్యాధితో మృత్యువాత పడినట్లు నాటకం ఆడానని తెలిపింది.
దీంతో కొందరు ఆమెను తిట్టుకోగా, ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.అయితే చనిపోయిందని రూమర్స్ వచ్చిన సమయం నుంచి ఈ ముద్దుగుమ్మ గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.
సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.అంతేకాదు ఆమె ఎవరు? ఆమె ఎంత డబ్బులు సంపాదించింది? అనే కోణంలోనూ వెతకడం ప్రారంభించారు.
మరి ఈ భామ ఎవరు, ఎంత డబ్బులు వెనకేసిందో తెలుసుకుందాం పదండి.2011 ప్రపంచకప్లో భారత్ గెలిస్తే నగ్నంగా తిరుగుతానని బోల్డ్ కామెంట్స్ చేసిందీ ముద్దుగుమ్మ.
అప్పుడే మొదటిసారిగా ప్రజల దృష్టిలో పడింది.చాలా బోల్డ్ గా ఉండే ఈ తారకు బోల్డ్ సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి.
వాటిలో నటిస్తూ ఇండస్ట్రీలో ఒక రొమాంటిక్ యాక్ట్రెస్ గా కొనసాగింది.కొన్ని సందర్భాల్లో శృతి మించిన అందాలను చూయించే ఫోటోషూట్స్ షేర్ చేసి వివాదాల్లో పడింది.
సమాజం తన గురించి ఏమనుకున్నా డోంట్ కేర్ అనుకుంటూ ఆమె ధైర్యంగా దేని గురించి అయినా మాట్లాడేది.
బిగ్ బాస్ ప్రోగ్రామ్లో ( Bigg Boss Programme )ఈ తారకు ఒక ఆఫర్ కూడా వచ్చింది కానీ అందులో పార్టిసిపేట్ చేయడానికి ఆమె ఒప్పుకోలేదు.
"""/" /
తక్కువ పారితోషికం ఇస్తున్నారని దానిని రిజెక్ట్ చేసింది.పూనమ్ పాండేకి రూ.
2-2.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తామని బిగ్బాస్ హిందీ టీమ్ బంపర్ ఆఫర్ ఇచ్చినా ఆమె దానిని సింపుల్ గా రిజెక్ట్ చేసింది.
మూడు కోట్లకు పైసా తక్కువైనా పార్టిసిపేట్ చేయనని కరాకండిగా చెప్పేసిందిట.అంటే ఆమె పాపులారిటీ, సంపాదన ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
చివరికి ఆమెకు అడిగినంత పారితోషికం ఇచ్చి నెక్స్ట్ సీజన్లో ఆడించారు. """/" /
పూనమ్ బిగ్ బాస్, సినిమాలు తదితర మార్గాల ద్వారా మొత్తం ఇప్పటిదాకా రూ.
52 కోట్లు సంపాదించిందని సమాచారం.సంపాదించడంలోనే కాదు ఈ ముద్దుగుమ్మ సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటుందని అంటారు.
కరోనా సమయంలో చాలామందికి ఆమె చేతనైనంత హెల్ప్ చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
తెలుగు వారికి కూడా ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే."మాలిని అండ్ కో" తెలుగు సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించింది.
పూనమ్ చివరిగా ద జర్నీ ఆఫ్ కర్మ (2018) అనే సినిమాలో కనిపించింది.
అనంతరం 2022లో లాక్అప్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి సెమీఫైనల్స్ దాక వెళ్లింది.
సెంట్రల్ ఎన్ఆర్ఐ సెల్కు 2022లో ఎన్ని ఫిర్యాదులు అందాయో తెలుసా?