ట్రోలర్స్ చేతికి చిక్కిన పూజా హెగ్డే.. మరి అంత ఈజీగా వదిలేస్తారా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

వాటిల్లో రాధేశ్యామ్ ఒకటి.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు.

ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కానున్నట్టు ఇటీవలే ప్రకటించారు.

ప్రభాస్ ను వెండి తెర మీద చూడక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.

అందుకే రాధేశ్యామ్ కోసం డార్లింగ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రమోషన్స్ పరంగా వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత దగ్గర చేసింది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తూ మేకర్స్ బిజీగా ఉన్నారు.

"""/"/ ఇక ఈ ప్రమోషన్స్ లో పూజా కూడా పాల్గొంటుంది.మార్చి 11 వరకు ఈమె ఎటు వెళ్ళడానికి లేకుండా లాక్ చేయడంతో తప్పక ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.

అందులోను పూజా మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రమోషన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది.

అయితే ఈమె ఎంత జాగ్రత్తగా ప్రమోషన్స్ చేసుకుంటూ పోతున్న ఎక్కడో ఒక చోట ట్రోలర్స్ కు చిక్కుతునే ఉంది.

గత కొద్దీ రోజులుగా ప్రభాస్, పూజా లపై రూమర్స్ వస్తున్నాయి.వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే మాట్లాడుకోవడం లేదని ప్రచారాం జరుగుతుంది.

ఆ రూమర్స్ కు చెక్ పెట్టె ప్రయత్నం చేసిన ట్రోలర్స్ మాత్రం వదలలేదు.

ఇక మరోసారి పూజా తన వ్యాఖ్యలతో ట్రోలర్స్ కు చిక్కింది.ఈమె ప్రమోషన్స్ లో భాగంగా 'మీరందరు నా సక్సెస్ ఫుల్ లైఫ్ గురించి అడుగుతున్నారు' అనబోయి 'నా సెక్స్ లైఫ్' అని అంది.

"""/"/ దీంతో ఈమె వెంటనే ఆ పదాన్ని సరిచేసుకుంది.అయినా కూడా ట్రోలర్స్ ఎందుకు వదులుతారు.

ఇలాంటి స్టఫ్ దొరికిన తర్వాత కూడా ఆమెను వదలడం జరగని పని.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చెయ్యడంతో అందరి పూజా కావాలని అంది అంటూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

ఇలాంటివి జరగడం అప్పుడప్పుడు సహజమే అని మరికొంత మంది చెబుతున్నారు.

పురాణాలను మోడర్న్‌గా చూపించగల ఏకైక డైరెక్టర్ బాపు.. ఆ సినిమాతో ప్రూవ్ అయ్యిందిగా..?