బుట్టబొమ్మ అందాలకు ఫిదా అవుతున్న కుర్రకారు..పిక్స్ వైరల్!

సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలతో దూసుకు పోతుంది ముద్దుగుమ్మ పూజా హెగ్డే.

ఈ బ్యూటీ పారితోషికంతో కూడా టాప్ లో ఉంది.మొన్నటి వరకు నయనతార ఉన్న ఆ ప్లేస్ ను రీసెంట్ గా పూజా ఆక్రమించింది.

తెలుగులో అల్లు అర్జున్ తో చేసిన అల వైకుంఠపురములో సినిమా హిట్ అవ్వడంతో ఈ బ్యూటీ కి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి.

ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే ను బుట్ట బొమ్మగా అభివర్ణిస్తున్నారు.తాజాగా ఈ బుట్టబొమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

అవి కుర్రకారుకు తెగ నచ్చేసాయి.దీంతో పూజా హెగ్డే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలలో వైట్ డ్రెస్ లో చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని మరింత అందంగా ఉన్న ఈ ఫోటోలు యువతను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.

"""/"/ తెలుగులో రామ్ చరణ్ సరసన ఆచార్య సినిమా, ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలు సెట్స్ మీద ఉండగా అఖిల్ త్యో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అక్టోబర్ 14న దసరా కానుకగా విడుదల కాబోతుంది.

ఇక ఆచార్య సినిమాలో కొద్దీ సేపు అయినా కూడా పూజా పాత్ర కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది.

"""/"/ రాధేశ్యామ్ విషయం గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.ఎట్టకేలకు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

ఇక తమిళ్ లో విజయ్ సరసన బీస్ట్ సినిమాలో కూడా ఈ బుట్టబొమ్మ నటిస్తుంది.

ప్రెసెంట్ అయితే ఈ ముద్దుగుమ్మ చేతి నిండ సినిమాలతో బిజీగా ఉంది.

Smartphone Photography Accessories : ఫోన్ లో మెరుగైన ఫోటోలను తీసేందుకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీ యాక్ససరీస్ లు ఇవే..!