కరోనా తొలి టీకాను బి‌జే‌పి నేతలు, సి‌ఎం లు తీసుకోవాలి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గాంధీ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.

అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బి‌జే‌పి నేతలు ముందుగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరాడు.కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో ప్రజలకు అనుమానాలు ఉన్నాయి.

ముందుగా వాటిని తొలగించాలని డిమాండ్ చేశాడు అందుకు మొదటి టీకాను ముఖ్యమంత్రులు, బి‌జే‌పి నేతలు తీసుకోవాలని అన్నాడు.

కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రజలకు భరోసా కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నాడు.

ఇతర దేశాల ప్రజా ప్రతినిధులను ఆదర్శంగా తీసుకోవాలని కోరాడు.ఇతర దేశాల్లో కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రజల్లో ఉన్న అనుమానం పోగొట్టేందుకు తొలి టీకాను ఆయా దేశప్రతినిధులు తీసుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశాడు.

మన దేశంలోనూ ఈ విధంగా టీకాను ముందుగా వారికే అందించాలని కోరాడు.

ఆ పిల్లాడి మాటలతో ఉద్వేగానికి గురై ఆనంద భాష్పాలు రాల్చిన రతన్ టాటా..?