అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ తనకుతానే ఒక రికార్డు సృష్టించుకుంటున్నాడు పొన్నాల లక్ష్మయ్య...

కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈరోజు బంజారాహిల్స్ లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జనగాం లో నిర్వహించిన సమయం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన 11 నిమిషాల మాటలు ఎందుకూ పనికిరాని మాటలని అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ తనకుతానే ఒక రికార్డు సృష్టించుకుంటూ ఉన్నాడని టిఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ ప్రజలు అభివృద్ధి సాధించింది ఏమీ లేదని ఏవైతే ప్రతిష్ఠాత్మక నీటి ప్రాజెక్టులు అని చెప్పుకుంటున్నారో ఆ ప్రాజెక్టుల ద్వారా ఎక్కడైనా ఒక నీటి చుక్క ఏ చెరువులకు ఏ పంటలకు ఇచ్చారో చూపెట్టాలని దమ్ముంటే ఎక్కడైనా చర్చకు మేము సిద్ధమే అని ఆ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో ఎక్కడ ఒక నీటి చుక్క పారలేదని వాటికి కేటాయించిన నిధులన్ని కేసీఆర్ ఇంటికి నిధుల వరద పారింది అని ఎద్దేవా చేశారు.

వైరల్ వీడియో: మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన మహిళ.. స్టార్ హీరో కామెంట్..