ఏపీ సీఎం జగన్ తో పొంగులేటి భేటీ..?

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో ఆయన సీఎం వైఎస్ జగన్ తో సమావేశం కానున్నారని తెలుస్తోంది.

అయితే వీరిద్దరి భేటీ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ నుంచి గెలుపొందిన పొంగులేటి తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఇటీవల తాజాగా రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే.