ఈ నెల 27న వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్
TeluguStop.com
వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది.
ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
మొత్తం 12 జిల్లాల పరిధిలో పోలింగ్(
Polling ) ను అధికారులు నిర్వహించనున్నారు.
వచ్చే నెల 5 వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.
బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా.600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
కాగా ఈ ఎన్నికల పోటీలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న( Teenmar Mallanna ), బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేయనున్నారు.