మహారాష్ట్రలో పొలిటికల్ హీట్..!!

మహారాష్ట్రలో పొలిటికల్ హీట్ పెరిగింది.మరాఠా రిజర్వేషన్ లను కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

బారామతితో పాటు పలు ప్రాంతాల్లో మరాఠా రిజర్వేషన్ల కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కాగా ఈ నిరసనలకు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన మద్ధతు పలికింది.ఈ క్రమంలోనే ఆందోళనల్లో రాజ్ థాకరే పాల్గొన్నారని తెలుస్తోంది.

మరోవైపు మరాఠా రిజర్వేషన్లపై చర్చించేందుకు గానూ కేబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశానికి సీఎం ఏక్ నాథ్ షిండే హాజరయ్యారు.అయితే గత కొన్ని రోజులుగా రిజర్వేషన్ల కోసం మరాఠాలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అలాంటి విషయాలు బయటకు చెప్పను.. లావణ్యతో ప్రేమపై వరుణ్ రియాక్షన్ ఇదే!