సంపద వనంలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో ఏర్పాటు చేసిన సంపద వనంలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

12 ఎకరాల విస్తీర్ణంలో 5 బ్లాకుల్లో 5 వేల మొక్కలు నాటేందుకు ఈ సంపద వనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ఇప్పటికే గుంతలు తీసిన వాటిలో త్వరగా మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, అదనపు డీఆర్డీఓ మదన్ మోహన్, ఎంపీడీఓ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

రజనీతో పోటీ అంటే సూర్య భయపడ్డారా.. వెనుకడుగు వేయడం వెనుక కారణాలివేనా?