ఫోటోటాక్‌ : ఇదుగో మైనపు కాజల్‌

బాలీవుడ్‌ మరియు టాలీవుడ్‌కు చెందిన అతి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఇప్పటి వరకు మేడమ్‌ టుస్సాడ్స్‌లో విగ్రహం ప్రతిష్ట ఛాన్స్‌ దక్కింది.

ఇప్పుడు ఆ అవకాశం హీరోయిన్‌ కాజల్‌కు దక్కింది.సౌత్‌ ఇండియాలో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఈ అమ్మడు హిందీ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.

ఈమె అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది.ఈమెను గౌరవించే ఉద్దేశ్యంతో మేడమ్‌ టుస్సాడ్స్‌ సింగపూర్‌ వారు ఆమె మైనపు విగ్రహంను ఏర్పాటు చేయడం జరిగింది.

సింగపూర్‌లో తాజాగా జరిగిన కాజల్‌ మైనపు విగ్రహం ఆవిష్కర కార్యక్రమంలో కాజల్‌ కుటుంబ సభ్యులతో కలిసి హాజరు అయ్యింది.

అక్కడ తన విగ్రహాన్ని చూసి కాజల్‌ చాలా ఆనందం వ్యక్తం చేసింది.అచ్చు కాజల్‌ అగర్వాల్‌ మాదిరిగానే అక్కడ విగ్రహంను ఏర్పాటు చేయడం జరిగింది.

కాజల్‌ అగర్వాల్‌ చెల్లి నిషా అగర్వాల్‌ తనయుడు కాజల్‌ మైనపు విగ్రహంను చూసి కన్ఫ్యూజ్‌ అయ్యాడట.

అంతగా బొమ్మను అందంగా మలిచారంటూ కాజల్‌ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.ఇక్కడ మీరు చూస్తున్నది నిజంగా కాజల్‌ను కాదు, ఆమె మైనపు విగ్రహానే.

! """/"/.

జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు చూసి అలా కామెంట్లు చేసిన పవన్ కళ్యాణ్.. ఏం చెప్పారంటే?